దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలు సొంతం చేసుకోన్న తెలుగు వారు



భారతీయ సినీ రంగ పితామహుడు  దాదా సాహెబ్ ఫాల్కే జన్మదినం సందర్భంగా 1969 నుంచి ప్రారంభించి ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు స్తూ ఉంది. ఇది భారత చలన చిత్ర రంగంలోనే అత్యున్నత పురస్కారం. చలన చిత్ర రంగానికి విశేష సేవలు అందించిన వారి జాబితాని రెండు నెలల పాటు కాచి వడపోసి సంవత్సరానికి  ఒక్కరిని ఎంపిక చేసి బంగారు కమలం, పది లక్షల రూపాయల నగదు,శాలువాతో సత్కరిస్తారు.

ఇప్పటికి 5 గురు  తెలుగు చలన చిత్ర ప్రముఖులు,1 తెలుగు ప్రముఖుడు, ఇద్దరు తెలుగు నేలపై పుట్టిన వారు వెరసి 8 మంది తెలుగు నేల/భాష కు చెందిన వారు ఈ పురస్కారాన్ని  సొంతం చేసుకోన్నారు.
తెలుగు చలన చిత్ర ప్రముఖులు:
  1. 1974:బొమ్మిరెడ్డి నరసింహ రెడ్డి(దర్శకులు)
  2. 1982:ఆక్కినేని లక్ష్మీ వర ఫ్రసాద రావు(నటులు,దర్శకులు,నిర్మాత)
  3.  1986:బొమ్మిరెడ్డి నాగి రెడ్డి(నిర్మాత)
  4. 1990:ఆక్కినేని నాగేశ్వర రావు(నటులు)
  5. 2009:దగ్గుబాటి రామా నాయుడు(నిర్మాత)
తెలుగు ప్రముఖుడు: 

  1.  1980: పైడి జైరాజ్ (నటులు,దర్శకులు,నిర్మాత)
తెలుగు నేలపై పుట్టిన వారు:
  1. 1969: దేవికా రాణి (నటి)
  2. 2005:శ్యామ్ బెనగళ్ (దర్శకులు,రచయిత)

Comments

Popular posts from this blog

నూతన సంవత్సర శుభాకాంక్షలు